
పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 23వ తారీఖున విడుదల చేశారు. ఈ ఫలితాల్లో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడంతో పాటు మార్కులు కూడా తక్కువగా వచ్చాయని ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పదివ తరగతి పరీక్ష ఫలితాలు ఎన్నడు లేని విధంగా పరీక్ష పూర్తి అయిన 22 రోజులకే ఫలితాలు విడుదల చేశామని అన్నారు . ప్రచారం ఆర్భాటంలో ఉన్న శ్రద్ధ విద్యార్థులకు సరైన రిజల్ట్స్ ఇవ్వడంలో విఫలం చెందారు.
చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కు అప్లై చేసుకున్నారు అందులో ఇప్పటికే 11,000 మంది పైచిలుకు విద్యార్థుల ఫెయిల్ అయిన వాళ్లు పాసయ్యారు మరి ముఖ్యంగా మార్కులు శాతం కూడా పెరిగాయి.
మీరు తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది విద్యార్థులు త్రిబుల్ ఐటీ లో సీట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి విద్యార్థులే స్వయంగా ప్రెస్ మీట్ లు పెట్టి వారి యొక్క బాధను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నారు.
కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి , విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల గురించి వీటిపైన మేము వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు.
*న్యూస్ బై*
*బి.రవి కుమార్*
*7671888053*